హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

-

హైదరాబాద్ వాసులకు అలర్ట్. బుధవారం(రేపు) రోజున నగరంలో ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఎల్బీ స్టేడియంలో రేపు.. క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్‌ క్రిస్మస్‌ విందు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి నిజాం కళాశాల వైపు వచ్చే వాహనాలు నాంపల్లి, చాపెల్‌రోడ్‌ వైపు మళ్లిస్తామని తెలిపారు.

అబిడ్స్‌ నుంచి నిజాం కళాశాల వైపు వచ్చే వాహనాలు ఎస్‌బీఐ, గన్‌ ఫౌండ్రి, నాంపల్లి రైల్వేస్టేషన్‌ మీదుగా మళ్లించనున్నారు. బషీర్‌బాగ్‌ నుంచి నిజాం కళాశాల వైపు వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ మీదుగా మళ్లించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంక్షల సమయంలో పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌, బషీర్‌బాగ్‌, గన్‌ఫౌండ్రి, అబిడ్స్ సర్కిల్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌, రవీంద్ర భారతి, ఇక్బాల్‌ మినార్‌, ఎంజే మార్కెట్‌, హైదర్‌గూడ కూడళ్లవైపు వాహనదారులు రావొద్దని సూచించారు. ఎల్బీ స్టేడియంకు వచ్చే వారికి ముందస్తుగా పాస్‌లు జారీ చేసినట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news