యాదాద్రిలో విషాదం.. కాంగ్రెస్ సభ స్టేజీని ఢీకొని యువకుడు మృతి

-

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.కాంగ్రెస్ సభ కోసం ఏర్పాటు చేసి ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్నది. ఈ ఘటన యాదాద్రి జిల్లా అడ్డగూడూర్ మండలం మానాయకుంట గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది.స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో గల బ్రిడ్జిపై మూసీ పరివాహక రైతుల ఆత్మీయ సమ్మేళనం పేరిట కాంగ్రెస్ నేతలు ఓ స్టేజీని ఏర్పాటు చేశారు.

ఏకంగా బ్రిడ్జిపై స్టేజీ వేయడంతో వచ్చిపోయే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రహదారి బాట ఉందనుకుని ఎప్పటిలాగానే ద్విచక్రవాహనంపై వెళ్లిన చరణ్(17) అనే యువకుడు సభా స్టేజీని ఢీకొని కిందపడిపోయాడు. గాయాల పాలైన చరణ్‌ని వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో హుటాహుటిన కాంగ్రెస్ నాయకులు ఆ స్టేజీని తొలగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news