మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్- బీజేపీ మద్య ఘర్షణ

-

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంతంగిలో ప్రచారం ముగిసిన అనంతరం రాజగోపాల్‌రెడ్డి సైదాబాద్‌ వెళ్లారు. అక్కడ టీఆర్ఎస్ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బీజేపీ జెండా కర్రను విసరడంతో టీఆర్ఎస్ కార్యకర్తకు గాయమైంది. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు.

అనంతరం ప్రచారంలో భాగంగా రాజగోపాల్‌రెడ్డి రెడ్డిబావి గ్రామం మీదుగా ఆరెగూడం వెళ్లారు. అక్కడ ప్రసంగం ముగించే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. రాళ్లు విసిరిన నిందితుల్ని పట్టుకోవాలని బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కాసేపటి తర్వాత ఏసీపీ ఉదయ్‌రెడ్డి హామీతో కార్యకర్తలు ఆందోళన విరమించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రాజగోపాల్‌రెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు.

Read more RELATED
Recommended to you

Latest news