గవర్నర్ మహిళా దర్బార్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

-

తెలంగాణ గవర్నర్ తమిళిసై శుక్రవారం రాజ్ భవన్ వేదికగా మహిళా దర్బార్ నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా తనకు అందిన ఫిర్యాదులను పరిశీలించిన ఆమె రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాజభవన్ ను గౌరవించాలని కూడా ఆమె ప్రభుత్వానికి సూచించారు. రాజ్ భవన్ లో మహిళా దర్బార్ ముగిసిందో లేదో ఆ కార్యక్రమంపై అధికార టిఆర్ఎస్ విరుచుకుపడింది.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వివేకానంద గవర్నర్ మహిళా దర్బార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ నిర్వహించింది ప్రజాదర్బార్ కాదన్న ఆయన అది పొలిటికల్ దర్బార్ అని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ లక్ష్మణరేఖ దాటినా కూడా తాము సహనంతోనే ఉంటున్నామని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version