టీఆర్ఎస్ కోసం 10 ఎకరాలు వదిలేస్తా అన్న ఎమ్మెల్యే…!

-

నల్లగొండ జిల్లా కేంద్రంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. నార్కట్ పల్లి మండలం మాండ్రా గ్రామంలో తన కొడుకు మనోజ్ పేరు మీద 10 ఎకరాల 10 గుంటలు భూమిని కొనుగోలు చేసానని, 296 ,292 సర్వే నంబర్లల్లో శ్రీశైలం అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశానని సమాధానం చెప్పారు. రెండు నెలలుగా కావాలని కొంతమంది వక్ర బుద్ధితో నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసారు.

టీఆరెస్ అధిష్టానం వద్ద తనకు చెడ్డ పేరు వచ్చే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్దే నాకు ముఖ్యం.. తప్పు చేసినట్లు నిరూపిస్తే ఆ భూమిని వదులుకోవడానికైనా సిద్ధమే అని స్పష్టం చేసారు. పార్టీ మారినప్పటినుంచి నన్ను టార్గెట్ చేస్తున్నారని, కుట్రలన్ని చట్టపరంగా ఎదుర్కుంటా అన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news