TSPSC లీక్ కేసులో ట్విస్ట్…ఆ భార్యాభర్తలపై వేటు

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సిట్ కార్యాలయంలో తొమ్మిది మంది నిందితుల విచారణ మూడవ రోజు ముగిసింది. మూడో రోజు కస్టడీ విచారణలో కీలక ఆధారాలు సేకరించింది సిట్. ప్రవీణ్, రాజేశేఖర్, రేణుక ఇచ్చిన సమాచారంతో పలువురు అనుమానితులను విచారించింది సిట్.

ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రవీణ్, రాజశేఖర్ ఇంట్లో సోదాలు జరిపింది.ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న రేణుక తో పాటు ఆమె భర్త డాక్యా నాయక్ పై వేటు పడింది. రేణుక వనపర్తి జిల్లా బుద్ధారం గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా విధులు నిర్వహిస్తోంది. భర్త డాక్య నాయక్ వికారాబాద్ జిల్లాలో ఉపాధి హామీ స్కీమ్ టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ ఈ కేసులో నిందితులుగా ఉన్న నేపథ్యంలో వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version