బ్రేకింగ్ : టీటీడీ ఈవో అశోక్ కుమార్ సింఘాల్ బదిలీ

-

ఏపీలో ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉన్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు కీలకమైన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పోస్ట్ లో నియమించింది ఏపీ ప్రభుత్వం. అలానే ప్రస్తుతం టీటీడీ ఏఈవోగా ఉన్న ధర్మారెడ్డికి ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

తిరుమలలో డిక్లరేషన్‌ కు సంబంధించిన అంశాల నేపథ్యంలోనే ఈవోపై బదిలీ వేటు వేసినట్టుగా ప్రచారం మొదలయింది. అయితే ఇప్పుడు ఇచ్చింది కూడా ప్రాధాన్యత కలిగిన శాఖ కావడం విశేషం. అనిల్‌ కుమార్ సింఘాల్ 1993 బ్యాక్‌ చెందిన ఐఏఎస్‌ అధికారి కాగా సుదీర్ఘ కాలం పాటు టీటీడీ ఈవోగా సింఘాల్ కొనసాగారు. ఇక కొద్ది రోజుల్లోనే మరో ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవోగా నియమించే అకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news