సామాన్య భక్తులకు శుభవార్త..శ్రీవారి బ్రహ్మోత్సవాలపై కీలక ప్రకటన

-

తిరుమల…జిల్లా యంత్రాంగంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పై ఇఓ దర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలపై కీలక నిర్ణయం తీసుకుంది టిటిడి పాలక మండలి. బ్రహ్మోత్సవాలు జరిగి సెప్టంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేది వరకు సర్వదర్శన భక్తులుకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని ప్రకటన చేశారు టీటీడీ ఇఓ దర్మారెడ్డి.

సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకే కీలక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సెప్టంబర్ 27వ తేదిన ధ్వజారోహణం సందర్భంగా శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున సియం జగన్ పట్టు వస్ర్తలు సమర్పిస్తారని ప్రకటన చేశారు.

అక్టోబర్ 1వ తేదిన గరుడ వాహనం,5వ తేదిన చక్రస్నానం కార్యక్రమం జరుగనుంది. బ్రహ్మోత్సవాలు జరిగే తోమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసామని తెలిపారు. అక్టోబర్ 1వ తేదిన గరుడసేవ సందర్భంగా ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. వాహన సేవలు ఉదయం 8 గంటలకు ….రాత్రి 7 గంటలకు నిర్వహిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version