తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌..ఇవాళ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

-

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌. ఇవాళ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల కానున్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవల టికెట్ల కోటాను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు జరిగే ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేసేందుకు టీటీడీ సిద్ధమయింది.

 

ఈ టికెట్ల ఆన్లైన్ బుకింగ్ ను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేస్తారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 2 కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తలకు సర్వ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,567 మంది భక్తులు కాగా.. తలనీలాలు సమర్పించిన 26,098 మంది భక్తులుగా ఉన్నారు. ఇక హుండీ ఆదాయం 5.40 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news