తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

-

తిరుమల భక్తులకు బిగ్‌ అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

దీంతో నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 56,723 మంది భక్తులు దర్శించుకున్నారు అటు నిన్న ఒక్క రోజే 21,778 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. అలాగే… తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్క రోజే రూ.3.37 కోట్లుగా నమోదు అయింది.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 12న దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ప్రోటోకాల్ దర్శనం మినహా మిగిలిన బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని వివరించింది. 11న బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబోమని వెల్లడించింది. ఇక, దీపావళి పండగ రోజున ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందున్న గంటా మండపంలో ఆస్థానం జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version