ఓటీటీ లోకి వచ్చిన తెలుగు కామెడీ వెబ్ సిరీస్..!

-

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తరుణ్ భాస్కర్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న తెలుగు కామెడీ సిరీస్ తులసివనం గురువారం ఓటీటీ లోకి వచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ సంబంధించి మొదటి ఎపిసోడ్ ఫ్రీ గా చూడవచ్చు. మొత్తం మూడు ఎపిసోడ్లు మాత్రమే రిలీజ్ చేశారు మిగిలిన ఎపిసోడ్లు త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సిరీస్ లో అక్షయ లగుసాని ఐశ్వర్య వెంకటేష్ టాక్సీవాలా విష్ణు కీలకపాత్ర పోషించారు. తులసి అనే ఒక యువకుడు జీవితంలో జరిగిన కొన్ని చిత్రవిచిత్ర సంఘటనలతో దర్శకుడు అనిల్ రెడ్డి సిరీస్ ని తీసుకు వచ్చారు. ఐఏఎస్ ఆఫీసర్ గా చూడాలని తండ్రి కోరుకుంటారు. కానీ క్రికెటర్ అవ్వాలని కలలు కంటాడు. ఒక సాఫ్ట్వేర్ జాబ్లో తులసి ఎందుకు చేరాడు హైదరాబాద్ కి వచ్చిన అతను కలలకి వాస్తవ జీవితానికి మధ్య ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనేది ఈ సిరీస్ యొక్క కథాంశం.

Read more RELATED
Recommended to you

Latest news