డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన మరో నటి…!

-

డ్రగ్స్‌ కేసులో టీవీ నటి ప్రీతికా చౌహాన్‌ పట్టుబడింది. పలు హిందీ సీరియళ్లలో నటించిన ప్రీతికా చౌహాన్… ఫైజల్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బోర్డు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. హిందీ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తు క్రమంలో డగ్స్ వ్యవహారం బయటపడింది. దీంతో అనేక మంది నటీనటులను ప్రశ్నించారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. అలాగే, డ్రగ్స్ సరఫరాదారులు, విక్రేతలతో ఎవరెవరు డ్రగ్స్‌ కొంటున్నారే అంశాలపై నిఘా పెట్టింది.

దీనిలో భాగంగానే ప్రీతికా చౌహాన్‌పై నిఘా పెట్టారు అధికారులు. ఆమె డ్రగ్స్‌ కొనగానే అరెస్ట్‌ చేశారు. ప్రీతికా నుంచి 99 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సంవాదన్ ఇండియా, దేవో కె దేవ్ మహదేవ్ వంటి హిందీ టీవీ సీరియళ్లలో ప్రీతికా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news