పులివెందుల బిడ్డ పిల్లిలా పారిపోయాడు !

-

మేము ఎక్కడ ఉన్నా మా ఆలోచన అమరావతిలో ఉంటుందని ముస్లిం లీగ్ పార్టీ ఏపీ అధ్యక్షులు బషీర్ అహ్మద్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కి, మూడు రాజధానుల కోసం పని చేస్తున్న పెయిడ్ ఆర్టిస్టులకు దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని ఆయన అన్నారు. జగన్ తన మ్యానిఫెస్టోలో నవరత్నాల గురించి చెప్పారు కానీ రాజధానిని మూడు ముక్కలు చేస్తామని చెప్పలేదని అన్నారు. రాజధాని అంశం రెఫరెండం గా ఎన్నికలు వెళ్లాలని ముస్లిం లీగ్ పార్టీ ఎప్పుడో వైసీపీకి సవాల్ చేసిందని కానీ మా సవాల్ స్వీకరించలేక పులివెందుల బిడ్డ పిల్లిలా పారిపోయారని ఆయన అన్నారు.

ఏవిఎంల వల్ల ముఖ్యమంత్రి అయిన జగన్ కి తాను సీఎం అయ్యాను అన్న సంగతి తెలియడం లేదని అన్నారు. ఇంకా పులివెందుల సర్పంచ్ గానే ఉన్నానని జగన్ అనుకుంటున్నారని, మూడు రాజధానులు అంటున్న ముఖ్యమంత్రి గుంటూరు నడి బొడ్డులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా చివరిలో పెడతారా ? అని ప్రశ్నించారు. ఒక కులంపై ఉన్న కక్షతో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఎంపీలతో అమరావతి కోసం పార్లమెంట్ లో పోరాటం చేస్తామని బషీర్ అన్నారు. పోలీసులతో రైతులపై దాడులు చేయిస్తున్నారు… ఇది పోలీసుల దౌర్జన్యకాండ కాదు జగన్ దౌర్జన్యకాండ అని అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగే వరకు రైతులతో పాటు మేము పోరాటం చేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news