ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు హతం

-

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. కాంకేర్‌ జిల్లాలోని సిక్సోడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కడ్మే శివారు అటవీ ప్రాంతంలో ఇవాళ తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.

జిల్లా రిజర్వ్ గార్డ్, సరిహద్దు భద్రతా దళం ప్రత్యేక బృందాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని.. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు చెప్పారు. కొందరు మావోయిస్టులు డీజీఆర్‌ పెట్రోలింగ్‌ బృందంపై కాల్పులు జరిపారని అధికారులు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతుల వివరాలు తెలియలేదని, సమీప ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version