ఏపీలో దారుణం: రెండేళ్ల చిన్నారి మెడ నరాలు కోసి హత్య

-

ఏపీ లోని అనంతపురం జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా ధర్మవరం లోని కొత్తపేటలో… రెండున్నర అ సంవత్సరాల ఓ చిన్నారిని సొంత తల్లి హత్య చేసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… శ్రీనివాసులు మరియు మీనాక్షి దంపతులు స్థానిక కొత్తపేట కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అయితే ఈ ఇద్దరి భార్యాభర్తల మధ్య కొన్ని రోజుల నుంచి చిన్నపాటి గొడవలు జరుగుతూ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తండ్రి శ్రీనివాసులు మరియు పెద్ద కుమార్తె ఇంటి నుంచి బయటికి వెళ్లారు. ఇదే సమయంలో మీనాక్షి… తన చిన్న కుమార్తె ను కత్తితో దారుణంగా హత్య చేసి… ఆపై ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే భర్త శ్రీనివాసులు కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న శ్రీనివాసులు వెంటనే మీనాక్షిని అనంతపురం ఆస్పత్రికి తరలించాడు. అయితే ఈ ఘటనలో రెండున్నర ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఇక ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version