మాహా సీఎంకు దావూద్ గ్యాంగ్ నుండి బెదిరింపులు

-

మహా రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు బెదిరింపు కాల్స్ రావడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ సంయుక్త సర్కారు కొలువులో ఉంది. సీఎంగా శివసేన అధ్యక్ష్యుడు ఉద్ధవ్ థాకరే ఉన్నారు. అయితే ఆయన నివాసం అయిన మాతోశ్రీ బాంబులు పెట్టి లేపేస్తామని థాకరేకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరులం అంటూ ఈ కాల్స్‌ చేసినట్టు చెబుతున్నారు. బాంద్రాలోని ముఖ్యమంత్రి నివాసానికే ఈ బెదిరింపు కాల్స్‌ వచ్చినట్టు చెబుతున్నారు.

maharashtra extends lock down till july 31
maharashtra extends lock down till july 31

దుబాయ్ లోని ల్యాండ్ లైన్ నెంబర్ నుండి ఈ కాల్స్ వచ్చినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. కాల్ చేసిన వ్యక్తి మాతో శ్రీ నివాసాన్ని బాంబుతో పేల్చివేస్తామని చెప్పి తన పేరు దావూద్ అని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇది ఆకతాయిల పనా లేకుంటే నిజంగానే ఆయన మీద ఏమయినా కుట్ర జరుగుతోందా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. ‌ఈ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఆయనకు కూడా భద్రత పెంచినట్టు పోలీస్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news