తెలంగాణలో 20కి చేరిన యూకే కరోనా కౌంట్

-

కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్త మయింది. యూకే నుండి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1216 మంది యూకే నుండి తెలంగాణకు వచ్చారు. వీరిలో 970 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఫలితాలు వచ్చిన వారిలో నిన్న ఇద్దరికీ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

corona

వీరిద్దరూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకి చెందిన వారు.  దీంతో మొత్తం ఇప్పటి వరకు 20 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి ఎనిమిది మంది, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు పాజిటివ్ గా ఉన్నట్లు ఫలితాలలో తేలింది. ఈ 20 మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డు లో ఉంచినట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version