తిరుమలకు చేరుకున్నా కేంద్ర హోం మంత్రి అమిత్ షా

-

కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. రేపు(శుక్రవారం) ఉదయం అమిత్‌షా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తిరుపతి, తిరుమలలో ఆయన నివసించే అతిథిగృహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలుమార్లు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలి సారి.అమిత్‌ షా తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా.. ఘనస్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు. ఈ రాత్రికి వకుళామాత అతిథిగృహంలో బస చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version