బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా.. డబ్బు కోసమే చరణ్ పెళ్లి చేసుకున్నాడు అన్నారు.. ఉపాసన

-

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. చరణ్ ను పెళ్లి చేసుకున్న సమయంలో బాడీ షేమింగ్ విషయంలో తను ఎన్నో కామెంట్స్ ఎదుర్కొన్నానని కానీ అవి ఏవి తనను మానసికంగా కుంగదీయలేదని వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన చరణ్ తో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. స్నేహితులుగా ఉన్న వారిద్దరూ పెళ్లి బంధం వరకు ఎలా వచ్చారో తెలిపారు. అలాగే జీవితంలో తను ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉపాసన.. “చరణ్‌, నేను కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా కలుసుకున్నాం. మా స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయ్యాం. మా ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు. ఒకరిపై ఒకరికున్న నమ్మకం, గౌరవం, ప్రేమతో ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ నన్ను ఏదో ఒక విషయంలో జడ్జ్‌ చేస్తూనే ఉండేవారు. సమాజంలో చాలామంది ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నవారే. నా పెళ్లైన కొత్తలో నేనూ బాడీ షేమింగ్‌ ఎదుర్కొన్నా. నేను బాగా లావుగా ఉన్నానని, అందంగా లేనని కామెంట్స్‌ చేశారు. ఇంకొంతమంది అయితే చరణ్‌ డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని కూడా విమర్శించారు. కానీ నేను ఆ సమయంలో కుంగిపోలేదు. ధైర్యంగా వాటిని జయించా. విమర్శలు చేసిన వారిని నేను నిందించాలని అనుకోవడం లేదు, వాళ్లకు నా గురించి ఏమీ తెలియదని, అందుకే అలా మాట్లాడారు. ఈ పదేళ్లలో నా గురించి వారికి తెలిసి, ఇప్పుడు నాపై వారి అభిప్రాయం మారిపోయింది. మనం విమర్శలను స్వీకరించే విధానంలోనే అంతా ఉంటుంది. ట్రోల్స్ వచ్చాయని నేను కుంగిపోలేదు. వాటిని జయించాను. నా విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు నేనొక చాంపియన్ లా ఫీల్ అవుతున్నా. ఆ విమర్శలను ఎలా ఎదుర్కొన్నానో నాకు మాత్రమే తెలుసు. నేను మరింత ధైర్యవంతురాలినయ్యాను.. “అని ఉపాసన చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version