విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అమెరికా విదేశాంగమంత్రి రుబియో ఫోన్

-

కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు అమెరికా విదేశాంగ మంత్రి రుబియో ఫోన్‌ చేసినట్లు సమాచారం. భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టాలని రుబియో సూచన చేసినట్లు తెలుస్తోంది.

అయితే, అంతకుముందే పాక్‌ ఆర్మీ చీఫ్‌తోనూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది.ఇదిలాఉండగా, ఇప్పటికే తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని భారత్ చెబుతుండగా.. పాకిస్తాన్ మాత్రం అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఉదయం పాక్ ఆర్మీ చీఫ్ మీడియాకు వెల్లడించారు. నిన్న రాత్రి పాక్ భారత్ మీద డ్రోన్ దాడులకు పాల్పడగా.. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news