బ్యాలెట్ వద్దు… ఈవీఎంలే వాడండి : ఎన్నికల కమిషనర్ ను కోరిన బీజేపీ !

-

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలసిన బీజేపీ నాయకులు, జీహెచ్ఎంసీ ఎన్నికలను EVMల ద్వారానే నిర్వహించాలని కొరారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్, ఎంఐఎంలు బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయని వారు అంటున్నారు. బ్యాలెట్ పేపర్ తో ఎన్నిక జరిగితే రిగ్గింగ్ కు అవకాశముంటోందని, విద్యాధికులు ఎక్కువగా ఉన్న హైద్రాబాద్ లో EVMలతో నిర్వహించాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు.

ఐటీ రంగం అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించక పోవడం అర్థం లేనిదని వారు అంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని కలిసిన బీజేపీ ప్రతినిధి బృందం, బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన నిర్ణయాన్ని ఎన్నికల కమిషనర్ కు తెలిపామని పేర్కొన్నారు. కరోనా సమయంలో బ్యాలెట్ కంటే ఈవిఎంల ద్వారా జరపడమే సురక్షితమని, బిహార్ ఎన్నికల్లో కూడా ఈవిఎంలనే వాడుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రజలందరూ ఈవిఎంల ద్వారానే జరపాలని కోరాలని బీజేపీ నేతలు కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version