వీడియోలో దారుణం…. ఆసుపత్రిలో 1000 కట్టలేదని రాడ్లతో కొట్టి చంపారు..!

-

ఆసుపత్రుల్లో అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. రోగులను కేవలం వ్యాపారంగా చూస్తున్నారు..! డబ్బు లేకపోతే సరైన వైద్యం చేయడం లేదు. డబ్బు కట్టకపోతే చికిత్స పారరంభం కూడా చేయడం లేదు అలా కొందరు రొగులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఇది ఇలా ఉంటే మరోపక్క ఆసుపత్రులకు వచ్చిన రోగులపై నిర్లక్ష్య ధోరణి చూపుతూ రోగులను ఆసుపత్రి వారే స్వయంగా చంపేస్తున్నారు. గత కొంత కాలంగా మనం ఇలాంటి కేసులు చూస్తూనే ఉన్నాము ఇక ఇప్పుడు ఇదే క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ లో మరో కేసు నమోదయ్యింది. కేవలం 1000 రూపాయలు కట్టలేదని ఓ రోగిని ఆసుపత్రి సిబ్బంధి వాళ్ళు కర్రలతో రాడ్లతో కొట్టి చంపేశారు.

వివరాల్లోకి వెళితే…ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సుల్తాన్ ఖాన్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా మూత్రం పోయడంలో ఇబ్బంది వస్తుందంటూ ఆస్పత్రికి వెళ్లాడు. రోగిని ఆసుపత్రి వారు అడ్మిట్ చేసుకున్నారు. సుల్తాన్ ఖాన్ ది పేద కుటుంబం దాంతో డబ్బు ఎంత అవుతుందని వారు ముందుగానే అడిగారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసి చెబుతామని చెప్పారు. స్కానింగ్ చేయకుండానే మందులకు గాను 5000 బిల్లు వేశారు. వారు దగ్గర ఉన్న డబ్బుతో ఆ బిల్ కట్టేశారు. ఆపై రోగిని ఒక రోజు అడ్మిట్ చేసుకోవాలని చెప్పారు దానికిగాను 4 నుండి 5 వేలు ఖర్చు అవుతుందని ఆసుపత్రి వారు చెప్పారు. అంత డబ్బు మా వద్ద లేదని వారు రోగిని డిశ్చార్జ్ చేయమని ఆసుపత్రి వారిని కోరారు. పాత డబ్బు అంతా కట్టేసి రోగిని తీసుకొని వారు బయటకు వెళ్ళిపోయారు. ఆసుపత్రి సిబ్బంధి ఒకరు వెళ్ళి వారు 1000 రూపాయలు తక్కువ కట్టారని ఆ డబ్బుని కట్టమని అడిగాడు. దీంతో ఇద్దరి నడుమ ఘర్షణ మొదలయ్యింది. ఆ గొడవ కాస్త చేతులెసుకోవడం వరకూ వెళ్లిపోయింది. ఆసుపత్రి సిబ్బంధిని రోగి కుటుంబ సభ్యుడు చమన్ కొట్టడంతో సిబ్బంధి వారు కర్రలతో రాడ్ లతో వారిపై దాడి చేశారు.. దాంతో రోగి సుల్తాన్ ఖాన్ అక్కడికక్కడే మరణించాడు. ఈ దృశ్యం అంతా సీసీటీవీ లో రికార్డ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుయి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news