నేను పార్టీ మారడమా…? కామెడీగా ఉంది…!

-

తాను పార్టీ మారే అవకాశం ఉంది అనే వార్తలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్పందించారు. తను పార్టీ మారుతానంటూ వార్తలు రావడం హాస్యాస్పదంగా ఉంది అని ఆమె కొట్టిపారేశారు. తన ఆస్తులను కాపాడుకోవడానికి ఎమ్మెల్యే వాసుపల్లి పార్టీ మారాలని అనుకున్నారు అని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ ట్రాప్ లో పడ్డారు అని ఆమె ఆరోపించారు.

నేను కూడా పార్టీలో చేరుతారని ప్రచారం వెనుక మైండ్ గేమ్ ఆడుతున్నారు అని అనిత విమర్శించారు. టిడిపి పార్టీ ఖాళీ అయింది అంటూ ప్రచారం చేయడానికే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని వంగలపూడి అనిత స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version