కొడుకుని కాపాడుకోవడం రంగంలోకి దిగిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

-

శివ గణేష్ కిడ్నాప్ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రంగంలోకి దిగారు. వరదరాజులరెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రొద్దుటూరు నుండి హైదరాబాద్ చేరుకున్నారు. శివ గణేష్ ను వరదరాజు రెడ్డి కొడుకు, అల్లుడు వాళ్ళ బ్యాచ్ తో అపహరించి బెదిరించినట్టు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కొండారెడ్డి, ఆతని అనుచరుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. అయితే హైదరాబాద్ చేరుకున్న వరదరాజులరెడ్డి బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

కొండా రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం అందుతోంది. కొండాపూర్ లో ఉన్న విల్లాకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులకి అక్కడ ఏమీ ఆధారాలు లభించలేదు. దీంతో కొండారెడ్డి, రవి రెడ్డి, రామ చంద్ర రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వరదరాజులరెడ్డికి తెలుగుదేశం పార్టీ తో సంబంధం లేదని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి స్పష్టం చేశారు. నిన్న ఆయన మాట్లాడుతూ గతంలోనే వరదరాజులరెడ్డి తాను ఏ పార్టీలో లేనని, ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని చెప్పారని, అలాంటప్పుడు ఇటీవల ఒక వ్యవహారంలో ఆయనను టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా మీడియా చెప్పడం సరికాదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news