మంత్రి రోజా ప్రవర్తన వెకిలిగా ఉంది : వర్ల రామయ్య

-

మంత్రి రోజా ప్రవర్తన వెకిలిగా ఉందని విమర్శించారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజం గెలిస్తే జగన్ శాశ్వతంగా జైల్లో ఉంటారని మంత్రి రోజా గుర్తు పెట్టుకోవాలని, డీజీపీ కసిరెడ్డి చెప్పేవన్ని అబద్దాలేనన్నారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మేం ఈ నెల 21వ తేదీ డీజీపీకి లేఖ రాశామని, నారా భువనేశ్వరి యాత్రకు సెక్యూర్టీ కల్పించాలని లేఖలో కోరామన్నారు. తనకు భువనేశ్వరి యాత్ర గురుంచే తెలియదని నిన్న డీజీపీ చెప్పడం సిగ్గుచేటని, డీజీపీకి వచ్చే లేఖలు సజ్జల చూస్తారా..? అని వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

మానవ హక్కుల ఉల్లంఘనలో ఏపీ బీహారులా మారిందని, వెంటనే డీజీపీ నారా భువనేశ్వరి యాత్రకి రక్షణ కల్పించాలన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్​ను ప్రజలకు తెలియజేయడానికే భువనేశ్వరి ప్రజల్లోకి వస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యంగాన్ని ఉల్లంగిస్తూ ఏపీలో వైసీపీ నేతలు మానవ హక్కులను కాలరాస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల ఛైర్మన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏపీలో ఓ ప్రాంతంలో ఉన్న వ్యక్త మరో ప్రాంతానికి వెళ్లాలంటే వైసీపీ నేతల పర్మిషన్ అవసరమా అంటూ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version