జైళ్ల శాఖ డీజీకి వర్ల రామయ్య లేఖ

-

జైళ్ల శాఖ డీజీకి టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామ‌య్య ఇవాళ జైళ్ల శాఖ డీజీకి లేఖ రాసారు.
కడప జైల్లో ఉన్న వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని లేఖలో కోరారు వర్ల రామ‌య్య‌. అదేవిధంగా కడప సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు రక్షణ కల్పించాలి.


దేవిరెడ్డి శంకర్ రెడ్జి, సునీల్ యాదవ్, గజ్జల ఉమా శంకర్ రెడ్డిలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరవించాలి. గతంలో మొద్దు శీనును జైల్లో హత్య చేసిన అంశాన్ని గమనంలోకి తీసుకోవాలి.
జైల్లో ఉన్న వివేకా హత్య కేసు నిందితులకు ప్రాణాపాయం లేకుండా సెక్యూరిటీ కల్పించాలి. ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే రాష్ట్ర ప్ర‌భుత్వ పాత్ర ఉంద‌ని భావించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version