ప్రజలు భయపడొద్దు.. కంట్రోల్‌రూంకు ఫోన్‌ చేయండి : వేముల ప్రశాంత్‌రెడ్డి

-

తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. అయితే మరో మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే.. రానున్న 24 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించాలని, అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి.. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రశాంత్‌రెడ్డి గత రెండు రోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలకు సుమారు 12 పాత ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, భారీగా ఇన్‌ ఫ్లో రావడంతో బాడిసి చెరువు పొంగిపొర్లిందని తెలిపారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్, రోడ్లు & భవనాల రోడ్లన్నింటిని మరమ్మతులు చేస్తున్నామని, బడిసి చెరువు పరివాహక ప్రాంతంలో నివసించే వారితో పాటు పూలంగు నది వెంబడి నివసిస్తున్న ప్రజలను సహాయక కేంద్రాలకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version