బిగ్ బ్రేకింగ్ : ఉప రాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్

-

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు అరవై లక్షలు దాటిపోయాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి దాకా 90 వేలమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ వైరస్ బారిన పడి ఒక కేంద్ర మంత్రి ప్రాణాలు కోల్పోగా కొంత మంది రాష్ట్రాల మంత్రులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర మంత్రులు చాలా మంది ఈ వైరస్ బారిన పడి కోలుకున్నారు.

అయితే తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో వెంకయ్యనాయుడు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వెంకయ్య ఈరోజు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా వచ్చింది. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉపరాష్ట్రపతి సతీమణి ఉషాకు కరోనా నెగటివ్‌ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె కూడా ముందు జాగ్రత్తగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారుని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version