స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీర్వాదం తీసుకున్న విజయసాయి

-

శ్రీ విశాఖ శారదా పీఠాన్ని వైసీపీ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత విజయ సాయిరెడ్డి సందర్శించారు. ఇవాళ ఉదయమే శ్రీ విశాఖ శారదా పీఠాన్ని సందర్శించడం జరిగిందని తన ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు విజయ సాయిరెడ్డి.

ఆశ్రమంలోని రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పీఠాధిపతి పూజ్య శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు పొందడం జరిగిందంటూ ట్విట్టర్‌ లో పేర్కొన్నారు సాయిరెడ్డి.

ఇక అంతకు ముందు ట్వీట్‌ లో టీడీపీ ఏకి పారేసారు సాయిరెడ్డి. జైలుకు వెళ్ళే వారంతా నేరస్తులు కాదురా ఎల్లోస్! అలా అయితే గాంధీజీ నుంచి చిదంబరం వరకు అందరూ నేరస్తులే అవుతారు. కోర్టులో నేర నిరూపణ జరిగి శిక్ష పడితేనే నేరస్తుడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతోంది పచ్చ కుల మీడియా? అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version