చౌకబారు డ్రామాలు మీ పేటెంటు చంద్రబాబూ : విజయసాయిరెడ్డి

-

ఉభ‌య గోదావ‌రి జిల్లాలలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌రిశీల‌న‌కు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు బృందం గురువారం ప‌డ‌వ ప్ర‌మాదానికి గురైన వైనంపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. చౌకబారు డ్రామాలు మీ పేటెంటు చంద్రబాబూ…మీతో అగ్రనటులు కూడా పోటీ పడలేరు. వరద నీటిని బాటిల్లో నింపి జనం వాటినే తాగుతున్నారని మీరు నమ్మించాలని చూస్తే వరద బాధితులే నవ్వుకుంటున్నారు.

మీరు జన్మలో మారరు అంటూ మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ఎవరైనా కొట్టుకుపోతుంటే పరామర్శకు వెళ్లినోళ్లు వరద నీటిలోకి దూకి వారిని ఒడ్డుకు చేర్చాలి. మీరే జారి నీళ్ళలో పడితే ఎలా బాబూ.? పబ్లిసిటీ కోసం రెండు అడుగుల నీటిలో అంత డేంజరస్ ఫీట్ అవసరమా? ఎల్లో మీడియా లైవ్ కవరేజి కోసమే కదా! అంటూ ఆయన విమర్శలగు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version