ఉప రాష్ట్రపతిని కలిసిన విజయసాయి రెడ్డి

-

భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని వైసీపీ రాజ్యసభ సభ్యుడు, కీలక నేత విజయ సాయి రెడ్డి ఈరోజు కలిశారు. ఉపరాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ఆయన వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టును వెంకయ్యకు అందజేశారు. ఈ విషయాన్ని విజయ సాయి రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

mp vijayasi reddy

వ్యవసాయ ఉత్పత్తులు, సముద్రపు ఉత్పత్తుల ఎగుమతులు, పంటలు, పసుపు, కొబ్బరి పీచు వంటి వాటికి సంబంధించిన రిపోర్టును గౌరవనీయులైన రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతికి అందించడం జరిగిందని ట్విట్టర్ లో ఆయన పేర్కొన్నారు. అయితే మొన్నీమధ్యనే విజయ సాయి రెడ్డి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న ఆయన దాని నుండి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version