కలకలం రేపుతున్న విజయవాడ మిస్టరీ డెత్..!

-

విజయవాడలో మిస్టరీ డెత్‌ ఇప్పుడు కలకలం రేపుతోంఇ. ఖరీదైన కారులో ఉన్న ఆ మృతదేహం పోలీసులకు సవాల్‌ గా మారింది. డీవీ మ్యానర్‌ హోటల్‌ పక్క సందులో ఆగి ఉన్న కారు డ్రైవింగ్‌ సీటులో కుప్పకూలిన వ్యక్తిని స్థానిక పోలీసులు గుర్తించారు. జి. కొండూరు లో గ్యాస్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీకి ఓనర్‌ గా పోలీసులు చెబుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తాడిగడపకు చెందిన కరణం రాహుల్‌ గాపోలీసులు గుర్తించారు.

ఏపీ 16 ఎఫ్‌ఎఫ్‌ 9999 బ్లాక్‌ ఎండీవర్‌ కారులో మృత దేహం ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యాపారాల్లో విభేదాలు ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మిస్టరీ డెత్‌ గా కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్య లేదా హత్య అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మృత దేహం పై గాయాలు లేకపోవడంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. పేనమలూరు పోలీస్‌ స్టేషన్‌ లో రాత్రి మిస్సింగ్‌ ఫిర్యాదు ఇచ్చారని సెంట్రల్‌ ఏసీపీ ఖాదర్‌ బాషా వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version