బెజవాడ మేయర్ పీఠంపై కన్నేసిన దేవినేని ఫ్యామిలీ..?

-

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని భావిస్తున్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిత్వం కోసం కూటమిలో ముందస్తు లాబీయింగ్ ఒక్కసారిగా స్పీడ్ అందుకుంది. అమరావతి రాజధానికి కూతవేటు దూరంలో ఉంటూ, ఆంధ్రప్రదేశ్‌కు గుండెకాయ లాంటి బెజవాడ నగరానికి కాబోయే మేయర్ ఎవరన్న చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నడుస్తోంది. ఈ ప్రతిష్టాత్మకమైన మేయర్ స్థానంపై విజయవాడ రాజకీయాల్లో దశాబ్దాల చరిత్ర కలిగిన దేవినేని కుటుంబం గట్టిగా ఫోకస్ పెట్టింది.

తాజాగా దేవినేని చందు తన భార్య మహిత, తల్లి అపర్ణ దేవితో కలిసి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను అమరావతిలో పర్సనల్‌గా కలిసి తమ ఆశను వ్యక్తపరిచారు. మంత్రి లోకేష్‌తో భేటీ అయిన అధికారిక ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. “ఒక మర్యాదపూర్వక కలయిక… ఒక కొత్త ఆశ” అంటూ దేవినేని చందు పెట్టిన పోస్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక  విజయవాడ మేయర్ సీటు రేసులో తమ పేరును, ముఖ్యంగా మహిళా కోటా లేదా యువ నాయకత్వ కోణంలో దేవినేని మహిత పేరును కూడా పరిశీలించాలని వారు అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది.

Vijayawada Mayor Seat: Is the Devine Family Making a Move?
Vijayawada Mayor Seat: Is the Devine Family Making a Move?

విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ కాలం నాటి నుండి ఆ కుటుంబానికి ఉన్న పాత కేడర్, బలమైన సామాజిక పట్టు తమ విజయానికి కలిసి వస్తాయని వారు నమ్ముతున్నారు. ఈ ముందస్తు భేటీతో బెజవాడ కార్పొరేషన్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే విజయవాడ మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తోంది.

బెజవాడ కార్పొరేషన్ పీఠంపై ఇప్పటికే పలువురు సీనియర్ లీడర్ల వారసులు కన్నేసి ఉంచడంతో, అధిష్టానం అన్ని సామాజిక సమీకరణాలను, నియోజకవర్గాల వారీగా ఉన్న గ్రూపు రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తోంది. కేవలం ఎన్నికల సమయంలో పార్టీ కోసం నమ్మకంగా ఉండి, క్షేత్రస్థాయిలో కష్టపడిన ఒరిజినల్ కేడర్‌కే ప్రాధాన్యత ఉంటుందని అధిష్టాన వర్గాల సమాచారం. టికెట్ ఎవరికి దక్కినా పార్టీ గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలనే బలమైన సంకేతాలను చంద్రబాబు, లోకేష్ పంపుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news