బ్రేకింగ్ న్యూస్: ట్రాఫిక్ రూల్ మీరారని ప్రధాని మోదీపై కంప్లైంట్ !

-

దేశప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం కేరళ రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా కేరళలోని కొచ్చిన్ రోడ్ షో నిర్వహిస్తుండగా… ట్రాఫిక్ రూలు ను ఉల్లంఘించారన్న కారణంగా త్రిస్సూర్ కు చెందిన ఒక వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశారు. మోదీ తన కార్ ఫ్రంట్ డోరును ఓపెన్ చేసుకుని నిల్చొని ప్రయాణం చేశాడని ఆన్లైన్ కంప్లైంట్ లో సదరు వ్యక్తి పేర్కొన్నాడు. పైగా కార్ పైన పూలు చల్లుతూ ఉండడం వలన అవి డ్రైవర్ కు వాహనాన్ని నడపడానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని అందులో వివరంగా చెప్పారు.

కాగా ఈ ఫిర్యాదు గురించి కేరళ పోలీసులు నుండి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. మరి ఒక ప్రధాని పైన కంప్లైంట్ చేసిన ఆ వ్యక్తి ఎవరో అని ఈ వార్త తెలిసిన వారు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కేరళ రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో ఈ ఒక్క కంప్లైంట్ ను బట్టి అర్ధం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version