వైరల్: అరుదైన కిరీటాన్ని ధరించిన పెళ్లి కూతురు..!

-

మారుతున్న కాలంతోపాటు వివాహ వేడుకలో కూడా మార్పులు వస్తున్నాయి. పూర్వకాలంలో పెళ్లి అంటే అమ్మాయి అబ్బాయికి పెళ్లిలోనే చూసుకునే వాళ్ళు. కానీ నేటి సమాజంలో మ్యాచ్ ఫిక్స్ అయినా దగ్గరి నుండి ఫోన్ లో మాట్లాడుతూ, ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ అని చేస్తున్నారు. ఇక ఆ ఫోటో షూట్స్ మరింత విభిన్నంగా ఉండేందుకు చాలా వెరైటీగా ఫోటోలు దిగుతుంటారు. అందులో కొన్ని విమర్శలకు గురవ్వగా.. మరికొంతమందివి ఆసక్తికరంగా నిలిచాయి. తాజాగా ఓ యువజంట తమ పెళ్లిలో తీసుకున్న ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

pakistan-bridal
pakistan-bridal

ఇక అమ్మాయికి పెళ్లి అనేది మధురమైన ఘట్టం. పెళ్లి కోసం అమ్మాయిలు ఎన్నో కలలు కంటుంటారు. అయితే ఇక్కడ పెళ్ళిలో వధువు అందగా కనిపించడంతో పాటు.. పెళ్లికి వచ్చిన అతిధుల దృష్టి కేవలం తనపై నిలిచేలా చేసుకుంది. అందుకోసం తనను తాను విభిన్నంగా మార్చుకుంది. తీగలతో అల్లుకున్నటువంటి ఎంబ్రాయిడరీ చేసిన డ్రెస్ ధరించి.. చెవులకు పెద్ద పెద్ద జూకాలు పెట్టుకొని, పాపిట్లో వెడల్పాటి మాంగ్ టిక్కా అభరణాలను అలంకరణ చేసుకొని ఫుల్ గ్రాండ్‏గా రెడి అయిపోయింది. వీటన్నింటికంటే ఎక్కువగా వధువు ధరించిన కిరీటం మరింత ఆకర్షణీయంగా నిలిచింది. ఈ ఫోటోలను తీసిన నటాషా జుబైర్ తన షోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.

అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న పెళ్ళికూతురు పాకిస్తాన్‏కు చెందిన వాజ్మా. తన పెళ్ళి కోసం తనను తాను విభిన్నంగా మార్చుకుంది. “నేను చాలా మంది పెళ్ళి కూతుళ్ల ఫోటోలను తీశాను. చాలా రకాల డిజైనర్ డ్రెస్సులు చూశాను. వాటిలో ఎలాంటి ఢిపరెంట్ కనిపించలేదు. కానీ వాజ్మా ఫోటోలను నాకు ప్రత్యేకంగా అనిపించాయి. ఆమె ధరించిన దుస్తులు నాకు ప్రత్యేకంగా అనిపించాయి. అలాగే ఆమె కిరీటం మరింత ఆకర్షణీయంగా అనిపించింది. తెలుగు, ఎరుపు గులాబీలతో కురలను అందంగా తీర్చిదిద్దింది. ఆమె డ్రెస్సింగ్ మొత్తం చైనీస్, ఇండోనేషియా సంస్కృతి నుంచి తీసుకున్నవి. అలాగే తల అభరణాలను మాత్రం కస్టమైజ్ చేసింది అంటూ తెలిపాడు”. ప్రస్తుతం ఈ యువజంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news