వైరల్ ఫీవర్స్.. కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ సంచలన ట్వీట్!

-

తెలుగు రాష్ట్రాల్లో వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పితో పాటు జలుబు వంటి లక్షణాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.ఏ ఆస్పత్రిలో చూసినా జనాల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా ఈ సమస్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం సోషల్ మీడియా ‘ఎక్స్’వేదికగా సంచలన ట్వీట్ చేశారు.

‘ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు! ఎవడి చావు వాడు చస్తాడు, మాకేం సంబంధం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. రోగాలు..నొప్పులు..వ్యాధులు.. బాధలతో జనం అల్లాడుతున్నా చలనం లేదు.. చర్యలు లేవు. విష జ్వరాలు విజృంభించి ప్రజల ఒళ్ళూ..ఇళ్లూ గుళ్లవుతున్నా పట్టించుకునే నాధుడే లేడు.బస్తీలకు సుస్తీ చేసింది.పల్లెలు మంచం పట్టినయ్..అయినా వైద్యారోగ్య శాఖకు చీమకుట్టినట్టు కూడా లేదు.పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి..దోమలు స్వైర విహారం చేస్తున్నా ప్రభుత్వ శాఖలు మొద్దు నిద్ర వీడటం లేదు.ప్రాణాంతక రోగాలు పట్టి పీడిస్తుంటే..అరికట్టాల్సిన ప్రభుత్వం అడ్రస్ లేదు’ అని కేటీఆర్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news