Virupaksha: విరూపాక్ష ట్రైలర్ కు ముహూర్తం ఖరారు

-

మెగా హీరో సాయిధరమ్ తేజ్ 15వ చిత్రంగా వస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ బ్యూటీ సంయుక్తా మీన‌న్ ఫీమేల్ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఇప్పటికే ఉగాది సందర్భంగా సాయిధరమ్‌ తేజ్‌ జీప్‌పై కూర్చున్న స్టిల్‌ విడుదల చేయగా, నెట్టింట హల్ చల్ చేస్తోంది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విరూపాక్షలో బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయిధరమ్‌ తేజ్ మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్‌ తెలుగు రీమేక్‌లో వన్‌ ఆఫ్ ది లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్ర బృందం. రేపు ఉదయం 11: 07 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version