జీవితంలో మొదటిసారి సిబిఐ విచారణకెళ్లిన విశాల్ !

-

కోలీవుడ్ హీరో విశాల్ ఈ మధ్యన నటించిన “మార్క్ ఆంథోనీ” సినిమాకు సంబంధించిన సెన్సార్ విషయంలో ముంబై ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు రూ. 6 .50 లక్షలు లంచం అడిగిందన్న కారణంతో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో విశాల్ చాలా రోజులు వార్తల్లో ఉన్నారు, కొందరు విశాల్ ను ప్రశంసించగా మరికొందరు ఇది ఎప్పుడూ జరిగేదే దీనిపై ఎందుకు ఇంత ఇష్యూ చేయడం దేనికి అంటూ ఉచిత సలహాలు ఇచ్చినవాళ్లు ఉన్నారు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం విశాల్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఈయన ముంబైలోని సిబిఐ ఆఫీస్ కు వెళ్లిన అనంతరం తన సోషల్ మీడియా వేదికపై పంచుకున్నారు. నా జీవితంలో సిబిఐ కార్యాలయానికి వెళ్లడం ఇదే తొలిసారి , ఇప్పటి వరకు ఎప్పుడూ వెళ్ళలేదు వెళ్తానని కూడా కలగనలేదు అంటూ విచారాన్ని వ్యక్తం చేశాడు విశాల్.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి తమిళ్ మరియు తెలుగు రెండు భాషలోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. కోలీవుడ్ హీరోలలో విశాల్ కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version