విశాఖ, అరకు టూర్ స్పెషల్ ప్యాకేజీ.. ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు..!

-

ఈ వేసవి లో సూపర్ టూర్ వేసేయాలి అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. విశాఖపట్నం, అరకు టూర్ వేసి వచ్చేయచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్పెషల్ బస్సు ని ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం 1, 2 డిపోలకు చెందిన బస్సులు 2023 మే 27న అందుబాటు లో ఉంటాయి. ఇక ఈ టూర్ కి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. విశాఖపట్నం, అరకు టూర్ ఈ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. భీమునిపట్నం బీచ్, తిరుమల తిరుపతి దేవాలయం, కైలాసగిరి, అరకు తో పాటుగా ట్రైబల్ మ్యూజియం, కాఫీ హౌస్, బొర్రా గుహలు, పద్మావతి గార్డెన్స్ ఇవన్నీ చూడొచ్చు.

స్పెషల్‌ గా సూపర్ లగ్జరీ బస్సు ని ఏర్పాటు చేసారు. ఒక రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ బస్సు అయితే శ్రీకాకుళం బస్సు స్టేషన్‌లో ఉదయం 9.00 గంటలకు బయలుదేరుతుంది. భీమునిపట్నం బీచ్, కైలాసగిరి, తిరుపతి దేవస్థానం ముందు చూడవచ్చు. తర్వాత ఎస్ కోట మీదుగా అరుకు వెళ్లాల్సి వుంది. అరకులో బస చేయాలి. యాత్రికులకు అరుకులో లాడ్జింగ్, డిన్నర్ ఉంటుంది. రెండో రోజు ఉదయం 8 గంటలకు బయలుదేరి అరకులో పద్మావతి గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, కాఫీ హౌస్, బొర్రా గుహల చూసి రావాచ్చు.

సాయంత్రం 6.00 గంటలకు శ్రీకాకుళం వెళ్ళచ్చు. ఒక్కో ప్రయాణికుడు రూ.2500 చెల్లించాలి. అలానే శ్రీకాకుళం నుంచి కూడా ఓ ప్యాకేజీ వుంది. గోపాలపురం బీచ్, చిలక సరస్సు కవర్ అవుతాయి. ఇది ఒక రోజు టూర్ ప్యాకేజీ మాత్రమే. శ్రీకాకుళం బస్ స్టేషన్‌లో ఉదయం 6.00 గంటలకు ఇది మొదలు అవుతుంది. గోపాలపురం బీచ్, చిలక సరస్సు వద్ద వున్న ప్రసిద్ధ మహాకాళీ ఆలయాన్ని చూడచ్చు. తర్వాత తిరుగు ప్రయాణం. సాయంత్రం 6.00 గంటలకు బయలుదేరితే శ్రీకాకుళం చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. రూ.1500 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version