విజయనగరం వృద్ధిరాలు మిస్టరీలో బయటపడ్డ నిజాలు..!

-

విజయనగరం జిల్లా మహారాజుపేట గ్రామంలో వృద్ధురాలు మిస్టరీ లో దాగివున్న నిజాలు బయటపడ్డాయి హంతకుడు విజయనగరం మండలం గుంకలామ్ గ్రామానికి చెందిన కూర్మారావుగా పోలీసులు వెల్లడించారు. హంతకుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఇంట్లోనే అద్దెకి ఉంటూ తగరపువలస బ్రిడ్జి వద్దనున్న ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు.

తరచూ వృద్ధురాలికి అతనికి గొడవలు జరిగేవట. జల్సాలకి అలవాటు పడి కూర్మారావు వృద్ధురాలు ఒంటిమీద బంగారంపై కాజేసాడు. ఆమె ఒంటిపై ఉన్న ఆరు తులాలు బంగారాన్ని కాజేసీ బాత్రూంలో కాలుజారి పడిపోయినట్లు చిత్రీకరించాడు పోలీసులు విచారణలోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కూర్మా రావు ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version