పార్టీ ఫిరాయించిన ఏ ఒక్కరినీ మేము వదిలిపెట్టము : జగదీశ్ రెడ్డి

-

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు.4 రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడటంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.

తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరారని, పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వం రద్దు చేయాలని కోరారు. పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయింపుపై పిటిషన్ ఇవ్వడానికి స్పీకర్‌ను సమయం కోరామని తెలిపారు. ఈ రోజు లేదా రేపు సమయమిస్తానని స్పీకర్ చెప్పారని ఆయన తెలిపారు. గతంలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వీరిద్దరి సభ్యత్వాలు రద్దు కావాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ ఇచ్చేందుకు స్పీకర్ సమయం ఇస్తారని భావిస్తున్నామని అన్నారు.పాంచ్ న్యాయ్ తీర్మానం ప్రకారం ఫిరాయింపులు ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెబుతుంటే, ఫిరాయింపులపై రాహుల్ బీజేపీపై దాడి చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీకి తోకలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఏ ఒక్కరినీ మేము వదిలిపెట్టమని, ప్రజల ముందు దోషిగా నిలబెడతామని అన్నారు .స్పీకర్ న్యాయంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version