ట్యాంక్ బండ్ పై స్టాళ్లను ఏర్పాటు చేస్తాము : సీఎస్ శాంతి కుమారి

-

తెలంగాణ దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.ఇవాళ సీఎస్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో శాంతి కుమారి మాట్లాడుతూ..జూన్ 1వ తేదీ సాయంత్రం నుంచే ట్యాంక్ బండ్ పై స్టాళ్లను ఏర్పాటు చేస్తామని,సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.

జూన్2న రాత్రి 11 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. 2వ తేదీ సాయంత్రం 7 గంటలకు ట్యాంక్ బండ్ పై వెలుగులు విరజిమ్మే క్రాకర్స్, పటాకులు కాల్చుతారని, కార్నివాల్ ఏర్పాటు చేయబోతున్నామని శాంతి కుమారి తెలిపారు. కాగా, ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉద్యమకారులతో సహా రాష్ట్రంలోని ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందించాలని ప్రభుత్వం నిర్ణయించగా కెసిఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news