ముగిసిన విదేశీ పర్యటన… రేపు తెల్లవారు జామున ఏపీకి జగన్

-

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సతీమణి భారతితో కలిసి ఆయన లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే.

జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మళ్లీ స్వదేశానికి రానున్నారు. లండన్ పర్యటనను ముగించుకుని శనివారం తెల్లవారుజామున 4 గంటలకు వైఎస్ జగన్ విజయవాడ చేరుకోనున్నారు. అనంతరం పార్టీ నేతలతో భేటీ అయి ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. కాగా కోర్టు అనుమతితో ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళ్లారు. కుటుంబ సమేతంగా లండన్‌తో పాటు యూకే, స్విట్జర్ లాండ్‌లోనూ ఆయన పర్యటించారు. జూన్ 31తో జగన్ పర్యటన గడువు ముగియడంతో తిరిగి రాష్ట్రానికి బయలుదేరనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news