ప్రభాస్ పక్కన ఛాన్స్ వస్తే ఎవరైనా వద్దంటారా..!!

-

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలుగా చేసిన బహుబలి దేశవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలుసు. అలాగే ఆ సినిమాలో శివగామి, కట్టప్ప పాత్రలు కూడా అంతే సమానంగా ప్రాచుర్యం పొందాయి.వాస్తవానికి ‘బాహుబలి’లో శివగామి పాత్ర కోసం ముందు అతిలోక సుందరిగా పేరు గాంచిన శ్రీదేవిని అడిగారట. కాని శ్రీదేవి కోట్లలో పారితోషికం, తనకు తన స్టాఫ్ కు స్టార్ హోటల్స్ లో రూమ్స్ ఇంకా చాలా కోరికలు కోరారట. అప్పటికే బడ్జెట్ దాటి పోయేలా వుండడంతో ఆమెకు నో చెప్పి, నెక్ష్ట్ ఆప్షన్ అయిన మంచు లక్ష్మి ని అడిగారట.

ముందు లక్ష్మికి కథ చెప్పి శివగామి పాత్ర చేయాలని కోరారట.కాని ఈ పాత్ర నేను చేయలేను అని  లక్ష్మి చెప్పిందట. అప్పుడు ఈ విషయంపై ఎవరికి స్పష్టత లేకుండా పోయింది. తాజాగా మంచు లక్ష్మి తాను ఆ పాత్ర వద్దు అనడానికి కారణం గురించి ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. వారు పాత్ర గురించి చెప్పినప్పుడు అసలు ప్రభాస్ కు నేను తల్లిగానా అని మనసులో అనుకున్నా, అతనికి నాకు పెద్ద ఏజ్ గ్యాప్ కూడా లేదు అందుకే నేను వద్దని చెప్పాను. అదే కాకుండా ఇండియాలో మనం ఒక పాత్ర చేసిన తర్వాత వరసగా మళ్లీ అలాంటి పాత్రలే ఎక్కువగా వస్తాయి.దాని వల్ల మనం ఒకే తరహ పాత్రల్లో చిక్కుకొని పోతాము. నేను అప్పుడే తల్లి పాత్రలు వేయకుండా వుండాలని ఆ ఆఫర్ ను కాదన్నాను అని చెప్పుకొచ్చింది. వాస్తవానికి నేను గతంలో చేసిన  ‘అనగనగా ఒక ధీరుడు’ లో ఐరేంద్రి పాత్ర చూసి రాజమౌళి గారు నన్ను శివగామి కోసం అడిగారని సీక్రెట్ బయట పెట్టింది.

 

ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ సినిమా పరిశ్రమలలో అడుగు పెట్టిన మంచు లక్ష్మి తాజాగా మలయాళ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. మోహన్‌లాల్ హీరోగా వస్తోన్న ‘మాన్‌స్టర్’ మూవీలో మంచు లక్ష్మి మంచి పాత్రలో నటించారు. ఈ చిత్రం దీపావళి కానుక గా నెల 21న  విడుదల కాబోతోంది. ఈ సినిమాపై కేరళలో భారీ అంచనాలున్నాయి. మోహన్‌లాల్ లాంటి దిగ్గజం సినిమాతో మలయాళ సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్న సంధర్భంగా ,ఆనందం వ్యక్తం చేస్తూ మంచు లక్ష్మి ఇటీవలే తన సంతోషాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news