ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన చిరంజీవి!

-

‘ఆచార్య’ పరాజయం సహా తన తదుపరి సినిమాలపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”మేము నటించిన ఏదైనా సినిమా ఫ్లాప్‌ అయితే దాని పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం. ‘ఆచార్య’ ఫ్లాప్‌ అయినందుకు నేను ఏమీ బాధపడలేదు. ఆ సినిమా పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను, చరణ్‌.. 80 శాతం పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సక్సెస్‌ కంటే ‘గాడ్‌ఫాదర్‌’ సక్సెస్‌నే చరణ్‌ ఎక్కువగా ఆస్వాదిస్తున్నాడు” అని అన్నారు.

దర్శకుడు బాబీతో చేస్తున్న సినిమా గురించి మాట్లాడారు చిరు. ”ప్రస్తుతం నేను చేస్తోన్న సినిమాలన్నీ వచ్చే ఏడాది వేసవి నాటికి విడుదలవుతాయి. మార్చి నుంచి కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తా. బాబీ సినిమాలో నా రోల్ ఫుల్‌ మాస్‌ లుక్‌లో ఉంటుంది. సంభాషణలన్నీ తూర్పుగోదావరి జిల్లా యాసలో ఉంటాయి. ప్రేక్షకులు తప్పకుండా ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంటారు. ఇక, ఈ సినిమా టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ని దీపావళి రోజున విడుదల చేస్తాం” అని చెప్పారు.

చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. క్రేజీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ ప్రాజెక్టు అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ధర్మస్థలి అనే ఊరు చుట్టూ తిరిగే ఈ కథను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news