వివేకా కూతురి వెనక ఉండి నడిపిస్తోంది ఎవరు ?

-

వైసిపి పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కోణంలో అనేక మలుపులు తిరుగుతోంది. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముందు వివేకానంద రెడ్డి హత్య చేయబడటం అప్పట్లో కలకలం రేపింది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ మరియు అధికార పార్టీ టిడిపి కి చెందిన నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఆ సందర్భంలో చంద్రబాబు ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేయించింది.

ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేసింది. అయినా గాని కేసులో సరైన పురోగతి లేకపోవడంతో వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇటీవల ఈ కేసు విచారణ కేంద్రం చేపట్టాలని హైకోర్టును ఆశ్రయించింది. దీంతో వివేకా కూతురు సునీత తన సొంత అన్న ప్రభుత్వంపై నమ్మకం లేక కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆశ్రయించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టానుసారంగా కామెంట్లు ఇటీవల చేశారు.

 

ఎవరో సునీత వెనకాల ఉండి నడిపిస్తున్నారని వాళ్ల డైరెక్షన్ లో నడుస్తున్నారని ఇందుమూలంగా నే జగన్ ప్రభుత్వం పై నమ్మకం లేక సిబిఐ విచారణ కోరడం జరిగిందని టీడీపీ శ్రేణులు కామెంట్ చేయడం జరిగింది. అయితే అసలు సునీత వెనకాల ఎవరూ లేరని ఆమె సొంతంగా తన తండ్రి పై ప్రేమతో హత్య ఏవిధంగా చెయ్యబడింది…అన్నది తెలుసుకోవడానికి మాత్రమే సునీత తొందర పడుతున్నట్లు ఇందుమూలంగా సిబిఐని ఆమె ఆశ్రయించినట్లు వైయస్ కుటుంబ సన్నిహితులు కామెంట్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version