తాగుబోతు దంపతులు : భర్త మర్మాంగం కోసి హత్య చేసిన భార్య..!

-

పశ్చిమ గోదావరి జిల్లా టి. నరసాపురం మండలం ముక్కినవారి గూడెంలో కఠారి అప్పారావు అనే వ్యక్తిని బుధవారం రాత్రి అతని భార్య హత్య చేసింది. కఠారి అప్పారావు తెలంగాణ కు చెందిన లక్ష్మిని 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి 14 ఏళ్ల కూతురు ఉంది. కాగా అప్పారావు, లక్ష్మి ఇద్దరూ మద్యానికి బానిసయ్యారు. ఇద్దరూ మద్యం తాగి తరచు గొడవ పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తను భార్య తాళ్లతో మంచానికి కట్టేసి మర్మాంగాలు కోసేసి హత్య చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version