షాకిచ్చిన నచ్చావులే హీరోయిన్ మాధవీలత …త్వరలో పెళ్ళి పీటలెక్కబోతుందిగా ..!

-

‘నచ్చావులే’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది మాధవీలత. రవిబాబు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా హిట్ అవడంతో నేచురల్ స్టార్ నాని నటించిన ‘స్నేహితుడు’ సినిమాలో నటించింది. అయితే ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. అందుకు కారణం కూడా నాని మాధవీలత స్నేహితులు గా నటించడమే. ఇక ఆ తర్వాత ‘అరవింద్ 2’ లో నటించింది. ఈ సినిమా సక్సస్ కాకపోవడంతో ఇక మాధవీలత మళ్ళీ సినిమాలలో కనిపించలేదు.

 

అయితే ఇక్కడ తని సక్సస్ కాకపోవడానికి కారణం తెలుగమ్మాయిని కావడమే అని పలు సందర్భాలలో వెల్లడించింది కూడా. అంతేకాదు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఆ ఇష్యూస్ మీద సందర్భం వచ్చినప్పుడల్లా సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికి మాధవీలత కి సినిమాలలో నటించాలని ఆసక్తి ఉన్నప్పటికి తనకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేరని వాపొతుంటుంది.

ఇక గత ఎన్నికల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవీ లత బీజేపీలో చేరి రాజకీయాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇక రీసెంట్ గా లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది మాధవీ లత.

ఇలా ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్న మాధవీలత పెద్ద షాక్ ఇచ్చింది. ”ఎన్నో నెలల తరువాత చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభం అయ్యింది. అద్భుతాలు జరిగాయి. అందుకే నేను ఎప్పుడూ మిరాకిల్స్ ను నమ్ముతాను. చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను” అంటూ పోస్ట్ చేసింది. మాధవీలత ఇలా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు త్వరలో తను కూడా పెళ్ళి పీటలెక్కబోతుందన్నది ఆ వార్తల సారాంశం అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో మాధవీలత క్లారిటీ ఇస్తే ఇంకా బావుంటుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version