ధోని ఆ రికార్డును సొంతం చేసుకుంటాడా.. ??

-

రాజస్థాన్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిపోయినప్పటికీ అభిమానులు మాత్రం నిరాశ చెందలేదు. ఎందుకు అంటారా..మ్యాచ్ చివర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి థోనీ అభిమానులను ఉత్సాహపరిచాడు. అయితే థోనీ ఇంకా కాస్త ముందు ఆటలోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే ఆట మరోలా ఉండేదని పలువురు క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. చెన్నై 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా, థోనీ మైదానంలో ఏడవ స్థానంలో అడుగుపెట్టే సరికి రన్ రేట్ భారీగా ఉంది.

దింతో జట్టు 200 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.. అయినా గానీ థోనీ మూడు బంతుల్లో వరుస సిక్సర్లు కొట్టి మునపటి థోనీ ని గుర్తు చేసాడు. అయితే టీ 20ల్లో భారత మాజీ క్రికెటర్ల సిక్సర్ల సంఖ్య 298కి చేరింది. అయితే థోనీ మిగతా రెండు సిక్సర్లు కూడా కొడితే మూడు వందల క్లబ్బులో చేరిపోతాడు. ఇప్పటికే భారత్ నుంచి రోహిత్ శర్మ, సురేష్ రైనా ఈ క్లబ్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు సిక్సర్లు కూడా కొడితే థోనీ మరో రికార్డు సంపాదించుకున్నట్లే… !!

Read more RELATED
Recommended to you

Exit mobile version