మహా శక్తి అమ్మవారి ఆశీస్సులతో లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తా: ఎంపీ బండి సంజయ్ కుమార్

-

మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా లోక్ సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.16 రాష్ట్రాల్లోని 195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును బీజేపీ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి పోటీ చేస్తున్న 9 మంది అభ్యర్థుల పేర్లు బీజేపి ప్రకటించింది.

తొలి జాబితా విడుదలపై ఎంపి బండి సంజయ్ కుమార్ స్పందించాడు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ సీటును మరోసారి తనకు కేటాయించడంపై ఎంపీ బండి సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహాశక్తి అమ్మవారి ఆశీస్సులతో కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో మరోసారి కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news